తెలంగాణ

telangana

ETV Bharat / state

'పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయం' - LOCK DOWN EFFECTS

కరోనా వేళ పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయమని ఆసిఫాబాద్​ పట్టణ ఎస్​ఎచ్​ఓ, పురపాలక కమిషనర్​ కొనియాడారు. కార్మికులకు మాస్కులు, సానిటైజర్లు అందించారు.

MASKS DISTRIBUTION TO SANITATION EMPLOYEES ON KUMURAM BHEEM DISTRICT
'పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయం'

By

Published : Apr 21, 2020, 4:56 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్​లో పారిశ్యుద్ధ్య కార్మికులకు డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్ట్ వారి ఆధ్వర్యంలో మాస్కులు, సానిటైజర్లు అందజేశారు. పంపిణీ కార్యక్రమంలో పట్టణ ఎస్ఎచ్ఓ మోహన్, పురపాలక కమిషనర్ రవికృష్ణ పాల్గొన్నారు.

కరోనా వైరస్​ను అరికట్టేందుకు ప్రభుత్వాలు లాక్​డౌన్ అమలు చేస్తున్న వేళ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుద్ధ్య కార్మికులు అనునిత్యం కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించి కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని సూచించారు.

ఇవీ చూడండి:కరోనా వేళ కేంద్రం కోత.. రాష్ట్రాన్ని నడిపేదెట్టా?

ABOUT THE AUTHOR

...view details