కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని అంకుసాపూర్ గ్రామస్థులు… తమ ఊళ్లోకి కొవిడ్ మహమ్మారిని రానీయ్యొద్దు తల్లీ అంటూ ఊళ్లో ఉన్న మహిళంతా గ్రామదేవతకు పూజలు చేశారు. సుమారు రెండొందల మంది తడి వస్త్రాలతో నీళ్ల బిందెలను మోసుకొచ్చి అమ్మవారికి అభిషేకం చేశారు. భౌతిక దూరం పాటించకుండా.. మాస్కులు ధరించకుండా పూజలు చేశారు.
కొవిడ్ మహమ్మారిని రానివ్వొద్దని గ్రామదేవతకు పూజలు - అంకుసాపూర్లో గ్రామ దేవతకు పూజలు
తమ ఊళ్లోకి కొవిడ్ను రానివ్వొందంటూ గ్రామస్థులు పూజలు చేశారు. సుమారు రెండొందల మంది భౌతిక దూరం పాటించకుండా... తడి వస్త్రాలతో నీళ్లబిందెలను తీసుకొచ్చి గ్రామదేవతకు అభిషేకించారు.
![కొవిడ్ మహమ్మారిని రానివ్వొద్దని గ్రామదేవతకు పూజలు pochamma temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-04:15:34:1620816334-11730109-kkdfg.jpg)
Telangana news
అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు, భౌతిక దూరం పాటించండి... మాస్కులు ధరించండి... కొవిడ్కు చికిత్స కంటే నివారణే నయమని ఎంతలా అవగాహన కల్పిస్తున్నా కొందరు ఇలాంటి చర్యలకు పాల్పడుతుండడం ఆందోళన కలిగిస్తుంది. కొవిడ్ నిబంధనలు పాటించకుండా ఇలాంటి కార్యక్రమాలు చేపడితే మరింత ప్రమాదమని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
ఇదీ చూడండి:అనవసరంగా బయటకొస్తే కేసులే..