తెలంగాణ

telangana

ETV Bharat / state

'సరిహద్దుల వద్దకు వచ్చి ఇబ్బందులు పడవద్దు' - తెలంగాణ సరిహద్దుల్లో లాక్ డౌన్

కుమురం భీం జిల్లాలో నేటి నుంచి లాక్​డౌన్​ను మరింత కఠినంగా అమలు చేస్తున్నట్లు ఎస్పీ వైవీఎస్​ సుధీంద్ర తెలిపారు. ఉదయం 10 గంటల తర్వాత అనవసరంగా బయటకు వచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని వాంకిడి చెక్ పోస్ట్​ను ఆయన తనిఖీ చేశారు.

lockdown in kumaram bheem district
lockdown in kumaram bheem district

By

Published : May 23, 2021, 2:59 PM IST

కుమురం భీం జిల్లా మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని వాంకిడి చెక్ పోస్ట్​ను.. జిల్లా ఎస్పీ వైవీఎస్​ సుధీంద్ర తనిఖీ చేశారు. ఆయా ప్రాంతాల్లో లాక్​డౌన్​ అమలవుతోన్న తీరును ఆయన పర్యవేక్షించారు. పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.

నేటి నుంచి లాక్​డౌన్​ను మరింత కఠినంగా అమలు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఉదయం 10 గంటల తర్వాత అనవసరంగా బయటకు వచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వారు.. సరిహద్దుల వద్దకు వచ్చి ఇబ్బందులు పడవద్దని కోరారు. వేరే రాష్ట్రాల నుంచి వచ్చే వారిలో.. ఈ పాస్ ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు.

ఇతర జిల్లాల నుంచి నిత్యావసరాల వాహనాల మినహా ఎలాంటి వాహనాలు అనుమతించవద్దని పోలీసు సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు. ప్రజలు సహకరించి.. నిబంధనలు తప్పక పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ అచ్చేశ్వర్ రావు, సీఐ సుధాకర్, ఎస్ఐ రమేశ్, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:లాక్​డౌన్ వేళ బయటకు వస్తే కరోనా టెస్టే!

ABOUT THE AUTHOR

...view details