కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గంగాపూర్ వాగు ఒడ్డుపై వెలిసిన శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో... ప్రతి ఏటా మాఘ శుద్ధ పౌర్ణమి రోజున అత్యంత వైభవంగా జాతర, రథోత్సవం నిర్వహిస్తారు. ఈ జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. ఈ నెల 26 నుంచి మూడు రోజుల పాటు జాతర జరగనుంది. కానీ, భక్తులకు సౌకర్యాలు కల్పించటంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
పూర్తి కాని ఏర్పాట్లు
జాతరకు సుదూర ప్రాంతాల నుంచి మొక్కులు తీర్చుకునేందుకు వస్తున్న భక్తులకు ఆలయంలో కనీస వసతులు కరువయ్యాయి. స్నానాల గదులు, మరుగుదొడ్లు లేకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఏడాది జాతర సందర్భంగా సుమారు 30 లక్షల ఆదాయం వస్తున్నా..... అభివృద్ధి మాత్రం జరగట్లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా శాశ్వత పరిష్కారం చూపించాలని కోరుతున్నారు.