తెలంగాణ

telangana

ETV Bharat / state

12,200 కిలోల బెల్లం, 2800 కిలోల పటిక పట్టివేత - బెల్లం పటిక ఎక్సైజ్​ పట్టివేత

గుడుంబా తయారీకి వినియోగించే బెల్లం, పటికను కుమురంభీం జిల్లా కాగజ్​నగర్​ ఆబ్కారీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని గోదాముల్లో నిల్వ చేసిన పంకజ్​ అగర్వాల్ అనే వ్యక్తి​పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

బెల్లం, పటిక పట్టివేత
బెల్లం, పటిక పట్టివేత

By

Published : Apr 24, 2020, 5:01 AM IST

కుమురం భీం జిల్లా కాగజ్​నగర్​లో గుడుంబా తయారీకి ఉపయోగించే 12,200 కిలోల బెల్లం, 2800 కేజీల పటికను ఆబ్కారీ అధికారులు పట్టుకున్నారు. రెండు రోజుల క్రితం పట్టణంలోని కీర్తి ట్రేడర్స్​కు బెల్లం లోడ్​తో వచ్చిన లారీని మొదట ఎక్సైజ్​ పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. అనంతరం కీర్తి ట్రేడర్స్ గోదాములు తనిఖీ చేసేందుకు వెళ్లారు. అందుకు యజమాని పంకజ్ అగర్వాల్ అంగీకరించలేదు. తిరిగి రెవెన్యూ, పోలీస్ అధికారులతో కలిసి గోదాముల్లో సోదా చేయగా 12,200 కిలోల బెల్లం, 2800 కేజీల పటికి లభ్యమైంది. వీటిని స్వాధీనం చేసుకుని.. యజమాని పంకజ్ అగర్వాల్​పై కేసు నమోదు చేసినట్లు ఆబ్కారీ సీఐ మహేందర్ సింగ్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details