తెలంగాణ

telangana

ETV Bharat / state

'గుండెపోటుతో ఆసిఫాబాద్ జిల్లా పశువైద్యాధికారి మృతి'

గుండె పోటుతో పశువైద్యాధికారి శంకర్ రాథోడ్ మృతి చెందిన ఘటన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

By

Published : Jun 3, 2019, 10:08 PM IST

మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పశువైద్యాధికారి శంకర్ రాథోడ్ గుండెపోటుతో మృతి చెందాడు. పశువుల టీకాల కార్యక్రమంలో భాగంగా బెజ్జూర్​కు వెళ్లేందుకు సిద్ధమై తన కారు డ్రైవర్​కు ఫోన్ చేసి పిలిపించాడు. అంతలోనే ఒంటరిగా ఉన్న అధికారికి గుండె నొప్పి వచ్చి మంచంపైన తూలిపోయాడు. డ్రైవర్ వచ్చి పిలవగా ఎంతకీ స్పందించలేదు.

తన కార్యాలయం అధికారులకు సమాచారం ఇచ్చిన డ్రైవర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న జిల్లా సహాయ పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు, జాయింట్ కలెక్టర్ రాంబాబు సహా జిల్లా అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు.

గుండె పోటుతో పశువైద్యాధికారి శంకర్ రాథోడ్ మృతి

ఇవీ చూడండి : పాడె ఎక్కించే ముందు బతికింది..

ABOUT THE AUTHOR

...view details