కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గోలేటిలో ప్రభుత్వం ఇచ్చిన భూమి కోసం లబ్ధిదారులు ధర్నా చేపట్టారు. తెలంగాణ అవతరించకముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రెండెకరాల భూమిని ఇప్పుడు తెరాస ప్రభుత్వం హరరితహారంలో భాగంగా చెట్లు నాటేందుకు ఉపయోగించడం దారుణమన్నారు. పేద వారికిచ్చిన భూములను లాక్కోవడం ఏంటని ప్రశ్నిస్తూ... ధర్నాకి దిగారు.
అప్పడి ప్రభుత్వం తమకిచ్చిన భూమికి పట్టాలు కూడా ఇచ్చిందని తెలిపారు. ఆర్డీఓ, తహసీల్దార్ వచ్చేవరకు తాము నిరసనను ఆపమని స్సష్టం చేశారు.