తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్టీసీ బస్సులో దొంగతనం

ఆర్టీసీ బస్సులో మహిళ దగ్గర నుంచి బంగారం దొంగిలించాడో దుండగుడు. మహిళ చేతి సంచిలో ఉన్న బంగారు ఉంగరం, పట్టాగొలుసులు తీసుకొని పారిపోయాడు.

By

Published : Mar 15, 2019, 8:02 PM IST

ఆర్టీసీ బస్సులో దొంగతనం

ఆర్టీసీ బస్సులో చోరీ జరిగింది. కుమురం భీం జిల్లా కాగజ్ నగర్​కు చెందిన మోర్లె సుమలత, తన ఆడపడుచు బెల్లంపల్లిలో రూ.5500 విలువైన బంగారం, రూ.3000 విలువైన పట్టాగొలుసులు కొనుగోలు చేశారు. అనంతరం తమ ఊళ్లకు వెళ్లేందుకు బస్సు ఎక్కారు. మార్గమధ్యంలో రెబ్బన వద్ద ఆడపడుచు దిగిపోగా సుమలత కాగజ్​నగర్​లో దిగింది. అనంతరం తన చేతి సంచి సగం తెరిచి ఉండటం గమనించి బంగారం కోసం వెతికింది. ఎంతకీ దొరక్కపోవడంతో దొంగతనం జరిగినట్లు తెలుసుకొని కన్నీరుమున్నీరైంది.

ఆర్టీసీ బస్సులో దొంగతనం

ABOUT THE AUTHOR

...view details