పురపాలిక ఎన్నికల్లో మద్యం, డబ్బు అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పురపాలికలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో నగర పొలిమేరల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు.
పకడ్బందీగా పురపాలక ఎన్నికలు
పురపాలక ఎన్నికల్లో మద్యం, డబ్బును అరికట్టేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. కుమురం భీం జిల్లా కాగజ్నగర్ వద్ద పోలీసులు రెండు చెక్పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు.
పకడ్బందీగా పురపాలక ఎన్నికలు
వంజిరి అటవీ శాఖ చెక్పోస్ట్, డాడా నగర్ వద్ద చెక్పోస్ట్లను ఏర్పాటు చేశారు. ఒక్కో తనిఖీ కేంద్రం వద్ద రెవెన్యూ, పోలీస్, ఆబ్కారీ సిబ్బంది విధులు నిర్వహిస్తూ విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఇవీ చూడండి;బస్తీమే సవాల్: మున్సిపల్ వార్లో యువత బస్తీమే సవాల్