కుమురం భీం జిల్లా సిర్పూర్ టీ మండలం పెన్గంగాలో బుధవారం సాయంత్రం ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. పోలీసులు, స్థానికులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. వాంకిడి మండలం బంబారకు చెందిన యాదగిరి రాజేష్.. కుటుంబ సభ్యులతో కలిసి సిర్పూర్ టీ మండలంలోని టోంకిని హనుమాన్ దర్శనానికి వచ్చారు. అనతరం పక్కనే గల పెన్గంగాలో స్నానానికి వెళ్లారు. స్నానం చేస్తుండగా లోతు తెలియక మునిగిపోయాడు.
లోతు తెలియక మునిగిపోయాడు.. ఆచూకీ కోసం గాలింపు - పెన్గంగాలో నదిలో వ్యక్తి గల్లంతు
కుమురం భీం జిల్లా సిర్పూర్ టీ మండలం పెన్గంగాలో బుధవారం సాయంత్రం ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. అతని కోసం బుధవారం నుంచి వెతుకుతున్నారు. స్నానం కోసం నదిలోకి వెళ్లి కనిపించకుండా పోయాడు.
![లోతు తెలియక మునిగిపోయాడు.. ఆచూకీ కోసం గాలింపు Drowned without knowing the river depth one man at penganga river](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9908892-1058-9908892-1608193180860.jpg)
లోతు తెలియక మునిగిపోయాడు.. ఆచూకీ కోసం గాలింపు
కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు.. ఘటనాస్థలికి చేరుకుని పోలీసులు విచారణ చేపట్టారు. రాజేశ్ కోసం గాలింపు చేపట్టగా.. రాత్రి కావడంతో బుధవారం ఆపివేశారు. ఈరోజు ఉదయం మళ్లీ వెతుకుతున్నారు. అయినప్పటికీ రాజేష్ ఆచూకీ లభ్యం కాలేదు. రాజేష్ ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు తీరంలో వేచిచూస్తున్నారు.
ఇదీ చూడండి :'కొందరు అటవీ అధికారుల వల్లే అడవులు నాశనం'