తెలంగాణ

telangana

ఆసిఫాబాద్‌లో రెండోరోజు డీజీపీ మహేందర్​రెడ్డి పర్యటన

By

Published : Sep 3, 2020, 7:59 AM IST

Updated : Sep 3, 2020, 11:41 AM IST

DGP Mahender Reddy's second day visit to Asifabad
ఆసిఫాబాద్‌లో రెండోరోజు డీజీపీ మహేందర్​రెడ్డి పర్యటన

07:56 September 03

ఆసిఫాబాద్‌లో రెండోరోజు డీజీపీ మహేందర్​రెడ్డి పర్యటన

కుమురం భీం ఆసిఫాబాద్‌లో డీజీపీ మహేందర్​రెడ్డి రెండోరోజు పర్యటిస్తున్నారు. నిన్న రామగుండం సీపీ, ఆదిలాబాద్ ఎస్పీతో డీజీపీ సమావేశమయ్యారు. రాత్రి ఆసిఫాబాద్‌లోనే బస చేసిన డీజీపీ మహేందర్... జిల్లాలో మావోయిస్టుల కదలికలపై పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్నారు. నిన్న ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల అటవీ ప్రాంతంలో డీజీపీ ఏరియల్ సర్వే నిర్వహించారు. 

జులై 16న తిర్యాని మండలంలో పోలీసులకు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరగడం విధితమే. ఈ క్రమంలో నిన్నిటి నుంచి.. ఆసిఫాబాద్​ జిల్లాకు డీజీపీ మహేందర్​రెడ్డి హెలికాప్టర్​ ద్వారా.. ఆసిఫాబాద్​కు చేరుకున్నారు. పోలీసులతో సమీక్ష సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. మావోయిస్టుల ఏరివేతలో ప్రత్యేకత చాటుకున్నటువంటి పోలీసులను గతవారం రోజుల క్రితం బదిలీలు చేసి.. ఆసిఫాబాద్​లో డ్యూటీలు వేశారు. డీజీపీ గత గడచిన నెల 15 రోజులలో జిల్లాకు రెండు సార్లు వచ్చి బస చేయడం ప్రత్యేకత చాటుకుంది. 

Last Updated : Sep 3, 2020, 11:41 AM IST

ABOUT THE AUTHOR

...view details