కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో డీజీపీ మహేందర్ రెడ్డి బస చేస్తున్నారు. ఈ నెల 2న హెలికాప్టర్లో ఆసిఫాబాద్కు చేరుకున్న డీజీపీ అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు. ఆయన నాలుగు రోజులుగా ఇక్కడే ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆసిఫాబాద్లోనే డీజీపీ.. ఎందుకెళ్లినట్టు.. ఏం చేస్తున్నట్టు? - కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వార్తలు
డీజీపీ మహేందర్ రెడ్డి గత నాలుగు రోజులుగా ఆసిఫాబాద్లోనే బస చేస్తున్నారు. డీజీపీ ఇక్కడ ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది.
నాలుగు రోజులుగా ఆసిఫాబాద్లోనే డీజీపీ
మహేందర్ రెడ్డి రామగుండం సీపీ సత్యనారాయణ, ఆదిలాబాద్ ఎస్పీ విష్ణు వారియర్తో కలిసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అటవీ ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించారు. శుక్రవారం రాత్రి మారుమూల అటవీ ప్రాంతమైన తిర్యాణి పోలీస్ స్టేషన్ను సందర్శించి.. పోలీసులకు దిశానిర్దేశం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడానికి నిరాకరించారు.
ఇదీ చూడండి:'సరిహద్దుల్లో యథాతథ స్థితిని పునరుద్ధరించాల్సిందే!'