తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆసిఫాబాద్​లో మొదటి టీకా మురళికే... - పారిశుద్ధ్య కార్మికునికి మొదటి టీకా

ప్రభుత్వం ప్రారంభించిన కొవిడ్​ టీకా పంపిణీలో ఫ్రంట్​లైన్​ వారియర్స్​కే ప్రాధాన్యం ఇచ్చారు. కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లాలో పారిశుద్ధ్య కార్మికునికి మొదటి టీకాను వేశారు. జిల్లాలో మూడు చోట్ల వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.

covid vaccine distribution in kumuram bheem asifabad district
మొదటి టీకాను పారిశుద్ధ్య కార్మికునికి ఇచ్చిన వైద్యులు

By

Published : Jan 16, 2021, 3:37 PM IST

ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో కొవిడ్​ టీకా వేస్తున్నట్టు కుమురం భీం అసిఫాబాద్ జిల్లా పాలనాధికారి రాహుల్​రాజ్​ తెలిపారు. జిల్లాలో ఆసిఫాబాద్​లో ఒకటి, కాగజ్​నగర్​లో రెండు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మొదటి టీకాను పారిశుద్ధ్య కార్మికుడు మురళికి వేశామన్నారు.

ప్రధాని ప్రసంగం అనంతరం వ్యాక్సిన్​ పంపిణీ కార్యక్రమం ప్రారంభించినట్లు కలెక్టర్ తెలిపారు. ఒక్కో కేంద్రంలో 30 మందికి చొప్పున మొత్తం 90 మందికి టీకాలు వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కొవిడ్ వ్యాక్సిన్ కేంద్రాన్ని జడ్పీ ఛైర్మన్​ కోవా లక్ష్మి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు పాల్గొన్నారు.

ఇదీ చూడండి :వ్యాక్సినేషన్‌పై వచ్చే వదంతులను నమ్మొద్దు: సీఎస్‌

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details