కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముంబయి నుంచి పట్టణానికి వచ్చిన ఇద్దరు వలస కూలీలకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయిందని జిల్లా వైద్యాధికారి బాలు తెలిపారు. పట్టణంలోని గంగారాం బస్తీకి చెందిన తండ్రి కూతుళ్లు కొన్నేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం ముంబయికి వలస వెళ్లారు.
కరోనాతో ప్రయాణం
- లాక్ డౌన్ నేపథ్యంలో ఈనెల 21న ముంబయి నుంచి జగిత్యాలలో ఉంటున్న తమ కూతురు వద్దకు చేరుకున్నారు.
- అక్కడి నుంచి 22న కాగజ్ నగర్ పట్టణంలోని స్వగృహానికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న వైద్య అధికారులు ఇరువురిని ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు.
- 23న రక్తనమునాలను గాంధీకి పంపించగా పాజిటివ్ నిర్థారణ అయినట్లు వైద్యులు వెల్లడించారు.