కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గత నాలుగు రోజులుగా పర్యటిస్తూ ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో డీజీపీ బస చేస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి పోలీసులకు దిశానిర్దేశం చేస్తూ... సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో జిల్లా పాలనాధికారి సందీప్ కుమార్ ఝా డీజీపీని కలవడానికి ఎస్పీ క్యాంపు కార్యాలయానికి వచ్చారు.
డీజీపీని కలిసిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా - కుమురంభీం జిల్లా కలెక్టర్ సందీప్కుమార్ ఝా డీజీపీని కలిశారు
కుమురంభీం జిల్లాలో గత నాలుగు రోజులుగా బస చేస్తున్న డీజీపీని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కలిశారు. అసలు ఏం జరుగుతుందోనన్నఉత్కంఠతో అందరూ ఎదురుచూస్తున్నారు.

కుమురంభీంలో బస చేస్తున్న డీజీపీని కలిసిన కలెక్టర్
ఈ మేరకు జిల్లాలో అసలు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. సమీక్ష సమావేశం అనంతరం బయటికి వచ్చిన అడిషనల్ ఎస్పీ సుధీంద్ర, మంచిర్యాల జిల్లా డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డిని మీడియాను కలవడానికి ప్రయత్నించగా వారు నిరాకరించారు.
ఇదీ చూడండి:'తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్ సహించదు'