తెలంగాణ

telangana

ETV Bharat / state

అతివేగంతో ఆటోను ఢీకొన్న కారు... ఒకరు మృతి - car dash to auto

రెబ్బెన మండలం తక్కిళ్లపల్లిలో రహదారిపై ఆటోను కారు  ఢీ కొట్టిన ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.

అతివేగంతో ఆటోను ఢీకొన్న కారు... ఒకరు మృతి

By

Published : Oct 22, 2019, 9:20 AM IST

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం తక్కిళ్లపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మహారాష్ట్ర చంద్రాపూర్ నుంచి మందమర్రికి వెళ్తున్న కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న ఆటోను ఢీ కొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మిగిలిన వారికి తీవ్రగాయాలయ్యాయి. ఆటో పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. అందులో ప్రయాణిస్తున్న ఐదుగురుకి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అతివేగంతో ఆటోను ఢీకొన్న కారు... ఒకరు మృతి

ABOUT THE AUTHOR

...view details