కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కొత్త సారసాల గ్రామంలో జరిగిన గొడవపై ఎస్పీ మల్లారెడ్డి స్పందించారు. ఉదయం 8 గంటల సమయంలో సార్సాలా గ్రామంలో ప్రభుత్వం ఉత్వర్వుల మేరకు చెట్లు నాటేందుకు వెళ్లిన అటవీశాఖ అధికారులపై రైతులు దాడి చేశారని వెల్లడించారు. ఈ ఘటనలో ప్రధాన పాత్రదారులైన కోనేరు కృష్ణారావు, అతని అనుచరుడు బూర పోషంను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. నిందితులపై హత్యాయత్నం, వాహనాల ధ్వంసం కింద కేసులు నమోదు చేశామన్నారు. ఈ ఘటనలో నిందితులకు తప్పనిసరిగా కఠిన శిక్షలు అమలయ్యేలా చూస్తామని ఎస్పీ మల్లారెడ్డి తెలిపారు.
'నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తాం' - అటవీశాఖ అధికారి
అటవీశాఖ అధికారి అనితపై దాడి చేసిన నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఆసిఫాబాద్ ఎస్పీ మల్లారెడ్డి తెలిపారు. తప్పు ఎవరు చేసిన కఠిన శిక్షలు పడేలా చూస్తామన్నారు.
!['నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తాం'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3704303-thumbnail-3x2-sp.jpg)
'నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తాం'
'నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తాం'