కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆశావర్కర్లు ఆందోళనకు దిగారు. తమ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ వాలంటరీ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నాను చేపట్టారు. ఆంధ్రప్రదేశ్లోని ఆశావర్కర్లకు కేటాయించినట్లే తమకు స్థిర వేతనాన్ని కల్పించాలని.. బకాయిపడ్డ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆశావర్కర్ల ఆందోళన - asha workers
తమ సమస్యలను పరిష్కరించాలంటూ కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు.

ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఆశావర్కర్ల ఆందోళన