తెలంగాణ

telangana

ETV Bharat / state

'శ్యాం ప్రసాద్ ముఖర్జీని స్మరిస్తూ ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి' - shyam prasad mukerji

భాజపా వ్యవస్థాపకులు శ్యాం​ ప్రసాద్​ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా కలెక్టరేట్​ ఎదుట ఎంపీ సోయం బాపురావు మెుక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మెుక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించాలని సూచించారు.

adilabad mp soyam bapu rao planted trees at kumurambheem asifabad collectorate
మెుక్కలు నాటిన ఆదిలాబాద్​ ఎంపీ సోయం బాపురావు

By

Published : Jun 23, 2020, 3:38 PM IST

శ్యాం ప్రసాద్​ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆదిలాబాద్​ ఎంపీ సోయం బాపురావు కోరారు. కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా కలెక్టరేట్​ ఎదుట ఆయన మెుక్కలు నాటారు. పార్టీ కోసం శ్యామ్​ ప్రసాద్​ ముఖర్జీ ఎంతో కృషి చేశారని, భారతదేశంలో హిందూత్వం కోసం ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేసుకున్నారు.

ఆర్టికల్ 370ని ఆనాడు కాంగ్రెస్ హయాంలో రద్దు చేయాలని ఎన్నోసార్లు పోరాటాలు చేశారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆ ఆర్టికల్​ను రద్దు చేసి ఆయన కలను నెరవేర్చారని గుర్తుచేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవుల జిల్లాగా పేరుగాంచిందని.. ఆ పేరును అలాగే నిలబెట్టేలా ప్రతి ఒక్కరు మెుక్కలు నాటాలని ఎంపీ సూచించారు.

ఇవీ చూడండి: 'వ్యవసాయాన్ని పండుగలా చేయాలన్నదే కేసీఆర్ లక్ష్యం'

ABOUT THE AUTHOR

...view details