కుమురం భీం జిల్లాలో ఒకవైపు కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ పోతుంటే మరోవైపు ప్రజలు నిత్యావసరాల పేరుతో బయటకు రావడం అధికమౌతుంది. కాగజ్నగర్ పట్టణంలో వివిధ ప్రాంతాల్లో కూరగాయల మార్కెట్ను ఏర్పాటు చేశారు. భౌతిక దూరం పాటించకుండా ప్రజలు మార్కెట్ను సందర్శిస్తున్నారు.
చర్యలు మరింత కట్టుదిట్టం - lockdown effect in kagaznagar
రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతుండగా పలుచోట్ల ప్రజలు నిబంధనలు పాటించడం లేదు. కూరగాయల మార్కెట్లో భౌతిక దూరం పాటించకుండా తిరుగుతున్నారు.
![చర్యలు మరింత కట్టుదిట్టం Actions are more committed in kagaznagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6863444-298-6863444-1587360773272.jpg)
చర్యలు మరింత కట్టుదిట్టం
పట్టణంలోని ప్రధాన వీధుల్లో ద్విచక్ర వాహనాలపై ఇద్దరిద్దరుగా వెళ్తున్న వారిని పోలీసులు ఆపుతున్నారు. మరోసారి ఇలా వస్తే వాహనాలు సీజ్ చేస్తామని చెబుతున్నారు. కాగజ్నగర్ తహసీల్దార్ ప్రమోద్, ఎస్ఎచ్ఓ మోహన్ కట్టడి చర్యలను పర్యవేక్షించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చూడండి :గృహ హింస ఫిర్యాదులకు సంప్రదించండి