కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెండరా గ్రామ సమీపాన రోడ్డు ప్రమాదం సంభవించింది. వాంకిడి మండలం కొత్తదుబ్బగూడెం గ్రామానికి చెందిన భీం రావ్ అతిగా మద్యం సేవించి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో అతనికి తలకు తీవ్ర గాయాలు కావటం వల్ల అక్కడిక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మద్యం మత్తులో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి - మద్యం మత్తులో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెండరా గ్రామంలో అతిగా మద్యం సేవించి వాహనం నడుపుతున్న భీం రావ్ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురై మరణించాడు.
![మద్యం మత్తులో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4156461-784-4156461-1565978914572.jpg)
మద్యం మత్తులో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి