తెలంగాణ

telangana

కదిలే రైల్లో నుంచి జారిపడి వ్యక్తి మృతి

ప్రయాణం సాఫీగా సాగిపోతోందనుకున్న ఆ వ్యక్తికి అదే చివరి ప్రయాణమైంది. గమ్యం చేరకుండానే... జీవితాన్ని ముంగించేశాడు. కదిలే రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి అనంతలోకాలకు చేరిపోయాడు. ఈ విషాదం కాగజ్​నగర్​ రైల్వేస్టేషన్​లో జరిగింది.

By

Published : Feb 4, 2020, 8:45 PM IST

Published : Feb 4, 2020, 8:45 PM IST

A MAN DIED FALLING FROM TRAIN AT KAGAJNAGAR
A MAN DIED FALLING FROM TRAIN AT KAGAJNAGAR

కుమురం భీం జిల్లా కాగజ్​నగర్ రైల్వే స్టేషన్​లో విషాదం నెలకొంది. ప్రయాణిస్తున్న రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి ఓ వ్యక్తి మరణించాడు. మృతుడు రాజస్థాన్ నివాసి అయిన భన్వర్​లాల్​గా రైల్వేపోలీసులు గుర్తించారు. నవజీవన్ రైలులో అహ్మదాబాద్ నుంచి చెన్నై వెళ్తుండగా... కాగజ్​నగర్ రైల్వేస్టేషన్​ వద్ద ప్రమాదవశాత్తు జారిపడిపోయాడు. తీవ్ర గాయాలపాలైన భన్వర్​లాల్ ఘటన స్థలంలోనే ప్రాణాలొదిలాడు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు భన్వర్​లాల్​ కుటుంబీకులకు సమాచారం అందిచారు. శవ పంచనామా అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.

కదిలే రైల్లో నుంచి జారిపడి వ్యక్తి మృతి

ఇదీ చూడండి:మేడారం ఎఫెక్ట్: ములుగుకు నలభైరోజుల్లో నాలుగో 'సారు'

ABOUT THE AUTHOR

...view details