తెలంగాణ

telangana

By

Published : Nov 16, 2020, 4:00 PM IST

ETV Bharat / state

గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనే ప్రభుత్వ లక్ష్యం: జడ్పీ ఛైర్మన్​

గ్రామాల్లో మౌలిక సదుపాయాలను కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఖమ్మం జిల్లా పరిషత్ ఛైర్మన్ కమల్​రాజు అన్నారు. మధిర మండలం నిదానపురంలో నూతనంగా నిర్మించిన పంచాయతీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.

ZP chairman starts panchatyat office in Khmmam dist madhira mandal
గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనే ప్రభుత్వ లక్ష్యం: జడ్పీ ఛైర్మన్​

ఖమ్మం జిల్లా మధిర మండలం నిదానపురంలో నూతనంగా నిర్మించిన చేసిన పంచాయతీ కార్యాలయాన్ని జడ్పీ ఛైర్మన్​ కమల్​రాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్​తో కలిసి ప్రారంభించారు. పల్లెసీమల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన అన్నారు.

మండలంలోని మాటూరుపేటలో రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్​ నాగేశ్వరరావు, ఎంపీపీ లలిత, సర్పంచ్ రావూరి శివనాగ కుమారి పాల్గొన్నారు.

ఇదీ చూడండి:అన్నదాత అరిగోస... ధాన్యం టోకెన్లకి అవస్థ

ABOUT THE AUTHOR

...view details