ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం మేడేపల్లి గ్రామంలో షార్ట్ సర్క్యూట్తో పూరిల్లు దగ్ధమైంది. ప్రమాదంలో వాసు ఇల్లు, గృహోపకరణాలు, నగదు పూర్తిగా కాలిపోయాయి. విషయం తెలుసుకున్న ఏన్కూరు జడ్పీటీసీ బుజ్జి, తెరాస నాయకులు మేమున్నామంటూ ముందుకొచ్చారు.
అగ్నిప్రమాద బాధితులకు ఆర్థిక సహకారం
ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం మేడేపల్లి గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఓ కుటుంబం సర్వం కోల్పోయింది. బాధిత కుటుంబానికి రెవెన్యూ శాఖ నుంచి ఆర్థికసాయం అందించారు.
అగ్నిప్రమాద బాధితులకు జడ్పీటీసీ సహకారం
రెవెన్యూ శాఖ ద్వారా తక్షణ సాయం కింది రూ.8 వేలు, నిత్యావసర సరుకులు అందజేశారు. తమకు రెండు పడక గదుల ఇంటిని మంజూరు చేయాలని బాధిత కుటుంబం జడ్పీటీసీను కోరారు.
Last Updated : Feb 29, 2020, 7:59 PM IST