తెలంగాణ

telangana

ETV Bharat / state

'పేదల పాలిట వరం కల్యాణలక్ష్మి పథకం' - కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కుల పంపిణీ తాజావార్తలు

రాష్ట్రంలోని పేదలు తమ పిల్లల పెళ్లిళ్లు చేయడంలో ఇబ్బంది పడొద్దనే భావనతోనే సీఎం కేసీఆర్‌ కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను ప్రవేశపెట్టారని వైరా ఎమ్మెల్యే రాములు నాయక్​ పేర్కొన్నారు. పట్టణ పరిధిలోని 42మంది లబ్ధిదారులకు ఆయన చెక్కులను పంపిణీ చేశారు.

Wyra MLA Ramul naik Distributes Kalyana lakshmi and Shadi mubharaq checks for Beneficiaries
పేదల పాలిట వరం కల్యాణలక్ష్మి పథకం

By

Published : Jun 10, 2020, 5:03 PM IST

ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 42 మంది లబ్ధిదారులకు చెక్కులను అందించారు. ఈ పథకం పేదల పాలిట వరంలాంటిదని ఆయన వెల్లడించారు.

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మాలోతు శకుంతల, జడ్పీటీసీ జగన్, రైతు సమన్వయ సమితి సభ్యులు సత్యనారాయణ, రమేశ్​ వివిధ పంచాయతీల సర్పంచులు ఎంపీటీసీలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details