ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో ఏర్పాటు చేసిన శుద్ధజల ప్లాంట్ల కోసం చేసిన ఖర్చు బూడిదలో పోసిన పన్నీరుగా మారింది. ఖమ్మం జిల్లాలో మొత్తం 1215 ప్రభుత్వ పాఠశాలల్లో 92,000 విద్యార్థులు... భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 1353 ప్రభుత్వ పాఠశాలల్లో 84,700 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీటిలో గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీ ఏరియాల్లో ఎక్కువ ప్రభుత్వ బడులు ఉన్నాయి.
ఆయా పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు స్వచ్ఛమైన మంచి నీటిని అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కొన్నేళ్ల కిందట జలమణి పథకం కింద ప్రభుత్వ బడుల్లో శుద్ధజల ప్లాంట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఉభయ జిల్లాల్లో మండలాల వారీగా శుద్ధజల ప్లాంట్లు అవసరం ఉన్న పాఠశాలలను ఎంపిక చేశారు. ప్రభుత్వ నిధులతోపాటు ప్రజాప్రతినిధుల నిధులు, స్వచ్ఛంద సంస్థలు, దాతల సహకారంతో చాలా చోట్ల ప్లాంట్లు ఏర్పాటు చేశారు.