తెలంగాణ

telangana

By

Published : Dec 12, 2020, 1:02 PM IST

ETV Bharat / state

'అన్ని రంగాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది'

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్​, సీఎంఆర్ఎఫ్​ లబ్ధిదారులకు ఖమ్మం జిల్లా వైరా తహసీల్దార్​ కార్యాలయంలో ఎమ్మెల్యే రాములు నాయక్​ చెక్కులు పంపిణీ చేశారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని నిరుపేదలు ఆర్థికంగా స్థిరపడాలని ఆయన కోరారు.

vaira mla distributed cheques in mro office
'అన్ని రంగాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది'

రాష్ట్రంలో అన్ని రంగాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే రాములు నాయక్​ అన్నారు. తహసీల్దార్​ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్​ఎఫ్​​ చెక్కులను అందజేశారు.

పేదింటి ఆడపిల్లల వివాహానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న తల్లిదండ్రులకు ఈ పథకాలతో సీఎం కేసీఆర్​ అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనారోగ్యంతో బాధపడేవారికి ఆరోగ్య శ్రీతో పాటు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా తోడ్పాటు అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలను సద్వినియోగం చేసుకొని నిరుపేదలు ఆర్థికంగా స్థిరపడాలని రాములు నాయక్​ కోరారు.

ఇదీ చదవండి:పేదల కోసం ఆరోగ్య పథకాలు తీసుకొచ్చాం: కిషన్‌రెడ్డి

ABOUT THE AUTHOR

...view details