తెలంగాణ

telangana

ETV Bharat / state

వరుస దొంగతనాలతో బెంబేలెత్తుతున్న వైరా ప్రజలు

ఖమ్మం జిల్లా వైరా పట్టణంలో దొంగలు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. నెల వ్యవధిలోనే వరస దొంగతనాలకు పాల్పడటం వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. కాలనీలో చోరీలు జరగకుండా కట్టదిట్టమైన భధ్రతను పెంచాలని స్థానికులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

By

Published : May 6, 2019, 6:15 PM IST

వరుస దొంగతనాలతో బెంబేలెత్తుతున్న వైరా ప్రజలు

ఖమ్మం జిల్లా వైరా పట్టణంలోని లీల సుందరయ్య నగర్​లో నాలుగు ఇళ్లలో వరుస చోరీలు జరిగాయి. అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు ఇళ్లలో చొరబడి నగదు, వెండి, బంగారు వస్తువులను అపహరించారు. గత నెలలో విశ్రాంత పోలీస్ ఇంట్లో భారీ మొత్తంలో బంగారు ఆభరణాలు చోరీ కాగా అదే ప్రాంతంలో దొంగలు మళ్లీ హల్​చల్ చేయటం వల్ల ప్రజలు బెంబేలెత్తుతున్నారు. వైరాతో పాటు ఏన్కూరులో ఇటీవల దొంగతనాలు చోటు చేసుకున్నాయి. ఓ ఇంట్లో సుమారు లక్ష రూపాయలతో పాటు బంగారు వస్తువులు దోపిడీకి గురయ్యాయి. జిల్లాలో పలుచోట్ల వరుసగా దొంగతనాలు జరగటం వల్ల ప్రజలు రాత్రివేళ భయభ్రాంతులకు గురవుతున్నారు.

వరుస దొంగతనాలతో బెంబేలెత్తుతున్న వైరా ప్రజలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details