తెలంగాణ

telangana

ETV Bharat / state

అధికారుల నిర్లక్ష్యం... రైతన్నలు ఆగ్రహం

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకంలో అనేక అవకతవకలు జరిగాయని... రైతులకు పాస్​బుక్​లు, రైతు భీమా పత్రం అందలేదని తిరుమల పాలెంలో రైతుల తాహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

By

Published : Jul 9, 2019, 4:03 PM IST

అధికారుల నిర్లక్ష్యం... రైతన్నలు ఆగ్రహం

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తిరుమల పాలెం మండలంలో రైతులు ఆందోళనకు దిగారు. వ్యవసాయ భూములకు అధికారులు పాసుబుక్​లు ఇవ్వటం లేదని... బుక్స్​ లేకపోవడం వల్ల బ్యాంకుల్లో అధికారులు రుణాలు ఇవ్వడం లేదని వాపోతున్నారు. అనేక సంవత్సరాల నుంచి భూమిని సాగు చేస్తున్నప్పటికీ... భూమి హక్కు పత్రాలు ఉన్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారని వాపోయారు. వెంటనే పాస్​పుస్తకాలు అందించి... రైతు భీమా పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. తాహసీల్దార్ రైతులకు నచ్చజెప్పి పది రోజుల్లోగా సమస్యలను పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు.

అధికారుల నిర్లక్ష్యం... రైతన్నలు ఆగ్రహం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details