తెలంగాణ

telangana

ETV Bharat / state

Boy Fell in River: నదిలో పడ్డ బాలుడు.. సాయం కోసం రాత్రంతా ఎదురుచూపులు - boy fell in river khammam

Boy Fell in River : పాఠశాల నుంచి ఎంతో ఉత్సాహంతో ఇంటికి బయలుదేరాడు ఆ బాలుడు. కానీ బస్సుల రూపంలో ప్రమాదాన్ని ఊహించలేదు. వంతెనపై నుంచి నడుస్తున్న క్రమంలో రెండు బస్సులు ఎదురెదురుగా రావడంతో అక్కడ నిలుచునే స్థలం కూడా లేక వంతెన గోడపై ఎక్కాడు. దిగుతున్న క్రమంలో జారి వంతెనపై నుంచి నదిలో పడ్డాడు. నదిలో నీళ్లు లేకపోవడం వల్ల గాయపడ్డాడు. రాత్రంతా అక్కడే చీకట్లో వణికించే చలిలో బిక్కుబిక్కుమంటూ సాయం కోసం ఎదురుచూశాడు.

Boy Fell in River
Boy Fell in River

By

Published : Dec 14, 2021, 10:53 AM IST

Boy Fell in River : రోజూలాగే ఆరోజూ పాఠశాలకు వెళ్లాడు. క్లాసులన్ని పూర్తయ్యాక.. తిరిగి ఇంటికి పయనమయ్యాడు. దారిలో ఓ నది.. దానిపై వంతెన. అలా వంతెనపై నుంచి నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న ఆ బాలుడికి గట్టిగా హారన్​ శబ్ధం వినడపటంతో ఉలిక్కిపడింది. అప్పటికే ముందు ఓ బస్సు వస్తోంటే పక్కకి జరిగాడు. ఇప్పుడు వెనక నుంచి మరో బస్సు వస్తోంది. రెండు బస్సులు ఎదురెదురుగా వస్తున్నాయి. ఆ వంతెన చిన్నదిగా ఉండటం వల్ల బస్సులు పట్టే స్థానం మాత్రమే ఉంది. ఏంచేయాలో అర్థంగాక ఆ బాలుడు వంతెన గోడపైకి ఎక్కాడు. బస్సులు వెళ్లగానే దిగడానికి ప్రయత్నించగా..కాలు తట్టుకుని వంతెన పైనుంచి నదిలో పడిపోయాడు. నదిలో నీళ్లు ఎక్కువగా లేకపోవడం వల్ల అతడి ప్రాణాలు దక్కాయి.

నదిలో పడ్డ బాలుడు

Boy Fell in River in Khammam : కానీ అటువైపు వెళ్లే వారికి బాలుడు కనిపించడు. ఎంత అరిచినా ఎవరికీ వినపడదు. సరే అని లేచి నడచి వెళ్దామనుకుంటే.. పై నుంచి పడటంతో కాళ్లు విరిగిపోయాయి. ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో నీటిలో.. చలిలోనే బిక్కుబిక్కమంటూ ఏడుస్తూ కూర్చున్నాడు. మరోవైపు ఆ బాలుడి కోసం ఇంటి వద్ద తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. ఎంతకీ తమ కుమారుడు రాకపోవడంతో గాబరా చెందారు. చుట్టుపక్కల అంతా వెతికారు. స్నేహితుల ఇళ్లలో ఆరా తీశారు. ఎక్కడా ఆచూకీ దొరకలేదు. ఉదయాన్నే పాఠశాలకని వెళ్లిన కొడుకు రాత్రైనా రాకపోవడంతో అతని కోసం నిరీక్షిస్తూ ఆందోళన చెందారు.

Boy Fell in Munneru River : ఖమ్మం జిల్లా నాయుడపేటకు చెందిన ఈశ్వర్.. నయాబజార్​ ఉన్నతపాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. సాయంత్రం పాఠశాల నుంచి తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో మున్నేరు నది వంతెనపై నుంచి కిందపడ్డాడు. నదిలో నీళ్లు ఎక్కువగా లేకపోవడం వల్ల బండలపై పడటంతో అతడి కాళ్లు విరిగాయి. సాయం కోసం చూస్తే ఎవరూ కనిపించలేదు. రాత్రంతా చలిలోనే ఈశ్వర్ బిక్కుబిక్కుమంటూ భయంతో ఉన్నాడు.

ఇవాళ ఉదయం చేపలు పట్టేందుకు వెళ్లిన జాలర్లు ఈశ్వర్​ అరుపులు విని అతడి వద్దకు చేరుకున్నారు. ఏమైందో ఆరా తీసి.. స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సాయంతో తల్లిదండ్రులు ఫోన్ చేసి సమాచారం అందించాడు.

ABOUT THE AUTHOR

...view details