తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీకి ప్రజల గుండెల్లో చిరస్థానం ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం అన్నారు. తెదేపా 40 ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం జిల్లా మధిరలోని పార్టీ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఘనంగా తెదేపా 40వ ఆవిర్భావ వేడుకలు - ఖమ్మం జిల్లాలో తెదేపా ఆవిర్భావ వేడుకలు
తెదేపా 40వ ఆవిర్భావ వేడుకలు ఖమ్మం జిల్లా మధిరలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాసిరెడ్డి రామనాథం కేక్ కట్ చేసి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అంబేడ్కర్ కూడలి వద్ద ఉన్న ప్రముఖుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఖమ్మం జిల్లాలో తెదేపా ఆవిర్భావ వేడుకలు
పార్టీ ఆవిర్భావ వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసిన రామనాథం అంబేడ్కర్ కూడలి వద్ద ఉన్న ప్రముఖుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చేకూరి శేఖర్ బాబు, మధిర పట్టణ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని పలు కూడళ్లలో జెండా దిమ్మలను ఆవిష్కరించారు
ఇదీ చదవండి:బిల్లు చెల్లించకపోతే.. కరెంట్ కనెక్షన్ కట్