తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా కట్టడిలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది: తెదేపా - ఖమ్మ జిల్లా తాజా వార్తలు

కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ... ఖమ్మం జిల్లా వైరాలో తెదేపా ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఆ పార్టీ కార్యాలయం ఎదుట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

tdp-protest-against-on-government-at-wyra-khammam-district
కరోనా కట్టడిలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది: తెదేపా

By

Published : Aug 13, 2020, 2:27 PM IST

ఖమ్మం జిల్లాలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నా.. వాటిని కట్టడి చేయడంలో పాలకులు పూర్తిగా విఫమయ్యారని తెదేపా నాయకులు ఆరోపించారు. వైరాలో తెదేపా ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.

వైరా నియోజకవర్గంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఇంటింటికి వెళ్లి కొవిడ్ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఓ వైపు ప్రజలు చావుకేకలు పెడుతుంటే.. నిర్మాణాల పేరుతో ప్రభుత్వ కాలం గడపడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.

ఇదీ చూడండి: రష్యా టీకాపై ఇప్పుడే ఏమీ చెప్పలేం: ఎయిమ్స్‌

ABOUT THE AUTHOR

...view details