తెలంగాణ

telangana

ETV Bharat / state

'తెలుగుజాతి కీర్తి ప్రపంచానికి చాటిన ఘనత ఎన్టీఆర్​దే'

దివంగత నేత ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఖమ్మం జిల్లాలో ఆయన విగ్రహానికి పలువురు నేతలు నివాళులు అర్పించారు. సినీ, రాజకీయ రంగాల్లో ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అనంతరం అన్నదానం వంటి కార్యక్రమాలు నిర్వహించారు.

By

Published : Jan 18, 2021, 1:42 PM IST

tdp-leaders-participated-in-ntr-25th-death-anniversary-and-did-tribute-to-ntr-at-madhira-in-khammam-district
'తెలుగుజాతి కీర్తి ప్రపంచానికి చాటిన ఘనత ఎన్టీఆర్​దే'

తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఖమ్మం ఎన్టీఆర్ కూడలిలోని ఎన్టీఆర్​ విగ్రహానికి పార్లమెంటరీ కమిటీ సభ్యులు నివాళులు అర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు, కమిటీ సభ్యులు కేతినేని హరీశ్, సీతయ్య తదితరులు పాల్గొన్నారు.

మధిరలో ఎన్టీఆర్​కు నివాళులు

తెలుగుజాతి కీర్తిని ప్రపంచానికి చాటిన ఘనత ఎన్టీఆర్​దేనని రాష్ట్ర తెదేపా ఉపాధ్యక్షుడు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం అన్నారు. ఖమ్మం జిల్లా మధిరలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. క్లబ్ కాంప్లెక్స్ కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహానికి, అంబేడ్కర్ కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. లెజెండరీ బ్లడ్ క్యాంప్​లో భాగంగా కార్యకర్తలు రక్తదానం చేశారు. అనంతరం అన్నదానం చేశారు.

కాకతీయ కమ్మ సేవా సంఘం బాధ్యులు గడ్డం శ్రీనివాసరావు, చెరుకూరి నాగార్జున ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు

ఇదీ చదవండి:తెలుగు వెలుగులు ప్రపంచానికి చాటిన వ్యక్తి ఎన్టీఆర్​: బాలకృష్ణ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details