chilli farmers problems: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మిరప సాగు చేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. వాణిజ్య పంట మిర్చిని సాగు చేసేందుకు ఎకరాకు లక్షకు తగ్గకుండా అన్నదాతలు పెట్టుబడులు పెట్టారు. ఉమ్మడి జిల్లాలో ఈసారి లక్షా 30 వేల ఎకరాల్లో మిర్చి సాగుచేశారు. గత సీజన్లో దిగుబడులు పెరగడం, ధర మెరుగ్గా రావడం చూసి ఈసారి అత్యధికంగా మిర్చి సాగువైపే మొగ్గుచూపారు. కాత పూత దశకు వరకు రైతుల్ని ఊరించిన మిరప పైర్లు ఆ తర్వాత తెగుళ్ల దెబ్బకు జీవం కోల్పొయాయి. కాయకుళ్లు తెగులు, జెమిని వైరస్, కింది ముడత, పైముడత, లద్దెపురుగు కొమ్మ కుళ్లు, కాయకుళ్లు, ఎండు తెగులు పంట ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపాయి. ప్రస్తుతం చేతికొచ్చే దశలో తామరపురుగు ఉద్ధృతి మిర్చి తోటలను పీల్చి పిప్పి చేస్తోంది.
'దాదాపు వారానికి మూడు సార్లు మందులు కొట్టాం. కూలీ వాళ్లకు డబ్బులివ్వాలి. ఎవరూ ఆదుకోవడానికి రావట్లేదు. ఎకారానికి లక్ష పెట్టుబడి పెట్టా... ఏమీ లేదు..మొత్తం పురుగు వచ్చింది. పంట చూస్తుంటే.. ఏడుపే వస్తోంది. ఇంకా నాకు ఏ పంట లేదు. ఈ ఒక్క పంటే వేశాను. నిండా మునిగిపోయా...
- మిర్చి రైతుల కన్నీటి వేదన