ఖమ్మం జిల్లా సత్తుపల్లి సింగరేణి ఉపరితల బొగ్గు గని కార్యాలయం ఎదుట రాజకీయ ఐకాస ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లోని గ్రామాల్లో సమస్యలు ఉన్నాయని తెలిపారు.
'డీఎంఎఫ్టీ నిధులను ప్రభావిత ప్రాంతాల్లోనే వాడాలి'
ఖమ్మం జిల్లాలో సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ధర్నా నిర్వహించారు.
'డీఎంఎఫ్టీ నిధులను ప్రభావిత ప్రాంతాల్లోనే వాడాలి'
వాటి పరిష్కారం కోసం సింగరేణి అధికారులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లోనే డీఎంఎఫ్టీ నిధులను ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి సమస్యలు వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: 'కాళేశ్వరం ప్రాజెక్టు.. తెలంగాణకు ఓ మకుటాయమానం'