తెలంగాణ

telangana

By

Published : Jul 10, 2019, 8:45 PM IST

ETV Bharat / state

ఇళ్లు, స్థలాలు ఇవ్వాలని పేదల సంఘం ఆందోళన

ఖమ్మం జిల్లా వైరాలో గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. అర్హులైన పేదవారికి ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేయాలని తహసీల్దార్​కు వినతిపత్రంను అందజేశారు.

ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇవ్వాలని పేదల సంఘం ఆందోళన

అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేయాలని కోరుతూ గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో వైరాలో భారీ ప్రదర్శన నిర్వహించారు. శాంతి నగర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా పేదలకు సాగు భూమి, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పోడు దారులకు హక్కులు కల్పించాలని, ప్రభుత్వ భూములు పేదలకు పంచాలని కోరారు.

ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇవ్వాలని పేదల సంఘం ఆందోళన

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details