ప్రత్యక్షంగా పరిశీలన
పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లపై ఆకస్మిక తనిఖీ - state election commition
ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని మధిరలో పోలింగ్ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల పరిశీలకుల బృందం ఆకస్మికంగా సందర్శించింది. పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలపై ఆరా తీసింది.
![పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లపై ఆకస్మిక తనిఖీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2840226-808-636928db-202a-4420-9382-437f0e56b309.jpg)
పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లపై ఆకస్మిక తనిఖీ
పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లపై ఆకస్మిక తనిఖీ
మధిర నియోజకవర్గంలో మొత్తం 2,10,358 మంది ఓటర్లున్నారు. వీరి కోసం మధిర, ముదిగొండ, చింతకాని, ఎర్రుపాలెం, బోనకల్ మండలాల్లో మొత్తం 255 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో ఓటర్లకోసం ఏర్పాటు చేసిన వసతులపై పరిశీలకుల బృంద సభ్యులు తనిఖీ చేశారు. వికలాంగులు, వృద్ధుల కోసం చేసిన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఇతర ఏర్పాట్లపై తహసీల్దారు, రెవెన్యూ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ఇదీ చదవండి: 'పార్టీ గుర్తేంటో తెలియని అభ్యర్థి నాపై పోటీయా'