తెలంగాణ

telangana

594 కేజీల గంజాయి పట్టివేత, విలువ ఎంతో తెలుసా

By

Published : Aug 29, 2022, 5:53 PM IST

Updated : Aug 29, 2022, 6:44 PM IST

Police seized illegal marijuana గంజాయి అక్రమ రవాణాను నివారించేందుకు పోలీసులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న కొందరు నిందితులు వాటిని చాలా సులభంగా పక్కరాష్ట్రాలకు తరలించేస్తునారు. తాజాగా భద్రాచలం జిల్లాలో భారీగా పట్టుబడిన ఈ గంజాయి అందుకు నిదర్శనం. వారి దగ్గర నుంచి 594 కేజీల ఎండు గంజాయితో పాటుగా రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు.

Police seized illegal marijuana
Police seized illegal marijuana

Police seized illegal marijuana: ఆంధ్రప్రదేశ్​లోని అల్లూరి జిల్లా మోతుగూడెం నుండి చెన్నై తరలిస్తున్న 594 కిలోల గంజాయిని భద్రాచలం జిల్లా సారపాక వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులని చూసి రెండు కార్లలో వస్తున్న ఇద్దరు యువకులు పారిపోగా సారపాకకు చెందిన అన్వేష్‌ని పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని కొందరు వ్యక్తుల నుంచి గంజాయిని కొనుగోలు చేసి చెన్నైకి చెందిన వ్యాపారికి అప్పగించడానికి తీసుకెళ్తున్నట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. పట్టుకున్న గంజాయి విలువ సుమారుగా కోటి 19లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు.

ఎస్సై మధుప్రసాద్​ సిబ్బందితో ఈరోజు ఫారెస్ట్​ చెక్​ పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తుండగా రెండు కార్లతో ఆంధ్రప్రదేశ్​లోని అల్లూరి జిల్లా మోతుగూడెం నుంచి చెన్నై తరలిస్తున్న 594 కిలోల గంజాయిని భద్రాచలం జిల్లా సారపాక వద్ద పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నాం. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ కోటి 19లక్షల రూపాయాలు ఉంటుంది. నిందితులను అరెస్ట్​ చేసి రిమాండ్​కి పంపించాం.- రోహిత్​ రాజ్, ఏఎస్పీ ​

భద్రాచలం జిల్లాలో గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు

ఇవీ చదవండి:

Last Updated : Aug 29, 2022, 6:44 PM IST

ABOUT THE AUTHOR

...view details