తెలంగాణ

telangana

పాలేరులో పెన్షన్​దారుల నిరసన..

By

Published : Jun 18, 2020, 8:43 PM IST

లాక్​డౌన్ కాలంలో ప్రజానికం నానాఅవస్థలు పడుతుంటే పెన్షన్​దారుల డబ్బు​లో కోత విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయాడాన్ని తప్పుపడుతూ ఖమ్మం జిల్లాలో పెన్షన్​ లబ్ధిదారులు నిరసన చేపట్టారు.

pensioners protest at khammam
పాలేరులో పెన్షన్​దారుల నిరసన

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండల కేంద్రంలో సబ్​ రిజిస్టార్​ కార్యాలయం ముందు పెన్షన్​​దారులు నిరసన చేపట్టారు. లాక్​డౌన్ సందర్భంగా పెన్షన్​దారుల పింఛన్​ రాష్ట్ర ప్రభుత్వం కోత విధించడాన్ని తప్పుపడుతూ జీవో పేపర్లను తగలబెట్టారు.

కోర్టు పింఛనుదారులు నుంచి పెన్షన్ కట్ చేయొద్దని హెచ్చరించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం లెక్కచేయడం లేదంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఇదీ చూడండి :రాష్ట్రంలో కొత్తగా 269 కరోనా పాజిటివ్​ కేసులు

ABOUT THE AUTHOR

...view details