తెలంగాణ

telangana

By

Published : May 17, 2019, 1:34 PM IST

ETV Bharat / state

ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగిస్తున్న అధికారులు

ఖమ్మం జిల్లా కేంద్రంలో చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు అధికారులు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగానే నేడు చెత్త తొలగింపు పనులను ప్రారంభించారు.

ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగిస్తున్న అధికారులు

స్వచ్ఛ ఖమ్మమే లక్ష్యంగా నగరంలో ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగించేందుకు అధికారులు నడుం బిగించారు. స్తంభాద్రి డెవలప్​మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో చెత్త తొలగింపు కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగానే వైరా ప్రధాన రహదారి వెంట ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి తరలించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగిస్తున్న అధికారులు

ABOUT THE AUTHOR

...view details