దిల్లీలో కర్షకులు 22 రోజులుగా గడ్డకట్టే చలిలో ఆందోళనలు చేస్తున్నా ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదని వామపక్షనేతలు విమర్శించారు. రైతులకు మద్దతుగా ఖమ్మంలోని ధర్నాచౌక్లో దీక్ష చేపట్టారు.
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి : వామపక్ష సంఘాలు - వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలంటూ వామపక్ష సంఘాల నాయకుల దీక్ష
రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలంటూ ఖమ్మంలోని ధర్నాచౌక్లో వామపక్ష నేతలు ఆందోళన నిర్వహించారు. అన్ని రైతు సంఘాల ప్రతినిధులు దీక్షలో పాల్గొని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి : వామపక్ష సంఘాలు
కార్పొరేట్లకు కొమ్ముకాసే నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో నాలుగు రోజులుగా దీక్షలు చేపడుతున్నామని రైతు సంఘాల నాయకులు పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వం చట్టాలను ఉహసంహరించుకునే వరకు పోరాట ఆగదని స్పష్టం చేశారు.