తెలంగాణ

telangana

ETV Bharat / state

అన్ని వర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయి

ఖమ్మం తెరాస ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు ప్రచారం ముమ్మరం చేశారు. గ్రామాల్లో రోడ్​షోలు నిర్వహిస్తూ... ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. కేసీఆర్​ ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ... ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

By

Published : Mar 29, 2019, 5:39 PM IST

ఏనుకూరులో రోడ్​షో...

రాష్ట్రంలో అన్ని రంగాల వారికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్​ చలవేనని ఖమ్మం తెరాస ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు స్పష్టం చేశారు. వైరా నియోజకవర్గంలోని ఏనుకూరులో రోడ్​షో నిర్వహించారు. పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. గిరిజన మహిళలు సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. తెరాస ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు చూసి రాష్ట్ర అభివృద్ధిలో భాగమయ్యేందుకే పార్టీలో చేరానని నామ వెల్లడించారు.

ఏనుకూరులో రోడ్​షో...

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details