తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉదయపు నడక నడిచే వారితో నామ ప్రచారం

ఖమ్మంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో తెరాస ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్యే అజయ్​కుమార్​ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉదయపు నడకకు వచ్చిన వారితో కలసి ఓటు వేయాలని అభ్యర్థించారు.

By

Published : Apr 1, 2019, 12:13 PM IST

ఉదయపు నడక నడిచే వారితో నామ ప్రచారం

ఉదయపు నడక నడిచే వారితో నామ ప్రచారం
పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్నాయి. అన్ని ప్రధాన పార్టీలు ప్రచార పర్వంలో మునిగిపోయాయి. ఓటరు మహాశయులను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు తెల్లవారు జామునుంచే పరుగులు పెడుతున్నారు.

ఖమ్మం లోక్​సభకు పోటీ చేస్తున్న తెరాస అభ్యర్థి నామ నాగేశ్వరరావు జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఉదయపు నడకకు వచ్చిన వారిని కలుసుకున్నారు. గ్రౌండ్​లో మార్నింగ్​ వాక్​కు వచ్చిన వారితో కలిసి మాట్లాడారు. నామతో పాటు ఎమ్మెల్యే అజయ్​కుమార్​ ప్రచారంలో పాల్గొన్నారు.

నామ ప్రతి ఒక్కరిని కలిసి ఓట్లను అభ్యర్థించారు. ఎమ్మెల్యే అజయ్​కుమార్​ తనను భారీ మెజార్టీతో గెలిపించారని... అదే విధంగా నామ నాగేశ్వరరావును కూడా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి:రంగారెడ్డి జిల్లాలో చిరుత సంచారం... దాడిలో లేగదూడ మృతి

ABOUT THE AUTHOR

...view details