ఖమ్మం లోక్సభకు పోటీ చేస్తున్న తెరాస అభ్యర్థి నామ నాగేశ్వరరావు జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఉదయపు నడకకు వచ్చిన వారిని కలుసుకున్నారు. గ్రౌండ్లో మార్నింగ్ వాక్కు వచ్చిన వారితో కలిసి మాట్లాడారు. నామతో పాటు ఎమ్మెల్యే అజయ్కుమార్ ప్రచారంలో పాల్గొన్నారు.
ఉదయపు నడక నడిచే వారితో నామ ప్రచారం
ఖమ్మంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో తెరాస ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్యే అజయ్కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉదయపు నడకకు వచ్చిన వారితో కలసి ఓటు వేయాలని అభ్యర్థించారు.
ఉదయపు నడక నడిచే వారితో నామ ప్రచారం
నామ ప్రతి ఒక్కరిని కలిసి ఓట్లను అభ్యర్థించారు. ఎమ్మెల్యే అజయ్కుమార్ తనను భారీ మెజార్టీతో గెలిపించారని... అదే విధంగా నామ నాగేశ్వరరావును కూడా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి:రంగారెడ్డి జిల్లాలో చిరుత సంచారం... దాడిలో లేగదూడ మృతి