తెలంగాణ

telangana

ETV Bharat / state

పంజాగుట్టలో అంబేడ్కర్​ విగ్రహాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి

హైదరాబాద్​లోని ​ పంజాగుట్టలో అంబేడ్కర్​ విగ్రహం తొలగించడాన్ని నిరసిస్తూ ఖమ్మంలో​ ఎమ్మార్పీఎస్​ నాయకులు ఆందోళన చేపట్టారు. తక్షణమే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని లేదంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

By

Published : Apr 18, 2019, 3:17 PM IST

ఖమ్మంలో ఎమ్మార్పీఎస్​ నాయకుల నిరసన

ఖమ్మంలో ఎమ్మార్పీఎస్​ నాయకుల నిరసన

హైదరాబాద్​ పంజాగుట్టలో అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని ఖమ్మంలోని జడ్పీ కూడలిలో ఎమ్మార్పీఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. చేతికి తాళ్లు కట్టుకొని వినూత్న నిరసన తెలిపారు. విగ్రహాన్ని కూల్చిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు. అంబేడ్కర్​ విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details