ఖమ్మం నగరంలో జరుగుతున్న అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఏమైనా ఉందా? అని భాజపాను ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. నాయకులు చెప్పాలని సవాల్ విసిరారు. జిల్లా తెరాస కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
పాత బస్టాండ్పై ప్రతిపక్ష నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. గోళ్లపాడు ఛానల్ నిర్వాసితులకు భూమి ఇచ్చినట్లు, వసతులు కల్పించినట్లు బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు.