తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతు వేదిక నిర్మాణ శిలాఫలకం ఆవిష్కరించిన ఎమ్మెల్యే సండ్ర

అన్నదాతలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. సత్తుపల్లి మండలం కొత్తూరులో రైతు వేదిక నిర్మాణం శిలాఫలకాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు.

By

Published : Aug 5, 2020, 8:30 PM IST

mla sandra venkata veeraiah participate raithu vedika foundation stone at kothur khammam district
రైతు వేదిక నిర్మాణ శిలాఫలకం ఆవిష్కరించిన ఎమ్మెల్యే సండ్ర

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు రైతు పక్షపాతిగా నిలుస్తున్నాయని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కొత్తూరులో రైతు వేదిక నిర్మాణం శిలాఫలకాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు.

రైతులు పండించిన పంటకు వారే గిట్టుబాటు ధరపై నిర్ణయం తీసుకునేందుకే రైతు వేదికలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని తెలిపారు. ఇందులో వ్యవసాయ అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంటారని... అన్నదాతలు వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఇదీ చూడండి :వంద క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details