తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వానికి ప్రజలు సహకరించండి: ఎమ్మెల్యే హరిప్రియ - CORONA EFFECTS

ఇల్లెందు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వలస కూలీలు, గొర్రెల పెంపకం దారులకు ఎమ్మెల్యే హరిప్రియ నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు.

MLA HARIPRIYA DISTRIBUTED GROCERIES IN ILLENDHU
ప్రభుత్వానికి ప్రజలు సహకరించండి: ఎమ్మెల్యే హరిప్రియ

By

Published : Apr 14, 2020, 3:38 PM IST

ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురంలో 500 మంది వలస కూలీలు, గొర్రెల పెంపకందారులు, వికలాంగులకు ఎమ్మెల్యే హరిప్రియనిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ప్రభుత్వం లాక్​డౌన్ పొడిగించినందున ప్రజలు సహకరించాలని ప్రజలను ఎమ్మెల్యే కోరారు. పలువురు దాతలు స్వచ్ఛంద సంస్థలు నిరుపేదలను ఆదుకోవటం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ మల్లిబాబు యాదవ్, ఎంపీపీ సునీత, పీఎసీఎస్ అధ్యక్షులు హనుమంతరావు, వైస్ ఎంపీపీ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:కరోనా కాలంలో కొత్త భయం- ఇళ్ల ముందు కరెన్సీ నోట్లు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details