తెలంగాణ

telangana

ETV Bharat / state

జాగ్రత్తలు తీసుకుంటూనే ప్రయాణిస్తున్నారు: మంత్రి పువ్వాడ

ఖమ్మం ఆర్టీసీ బస్టాప్​లో కరోనా నియంత్రణ నిబంధనలు పాటిస్తున్నారా? లేదా ? అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకుంటూనే ప్రయాణిస్తున్నారని ఆయన తెలిపారు. బస్సులో సిబ్బంది నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

By

Published : May 20, 2020, 1:30 PM IST

జాగ్రత్తలు తీసుకుంటూనే ప్రయాణిస్తున్నారు: మంత్రి పువ్వాడ
జాగ్రత్తలు తీసుకుంటూనే ప్రయాణిస్తున్నారు: మంత్రి పువ్వాడ

రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికులకు ఆర్టీసీ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఆర్టీసీ అధికారులు తీసుకుంటున్న కరోనా నివారణ చర్యలు... ప్రజలు తీసుకుంటున్న జాగ్రత్తలు తెలుసుకునేందుకు ఖమ్మంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ ఆకస్మిక తనిఖీ చేశారు.

ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటూనే ప్రయాణిస్తున్నారని మంత్రి తెలిపారు. ప్రతి బస్సులో కండక్టర్​, డ్రైవర్​ దగ్గర హ్యాండ్​ శానిటైజర్​ ఉండాలని ఆదేశించామన్నారు. అలా లేకుంటే కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామంటున్న మంత్రి అజయ్​ కుమార్​తో మా ప్రతినిధి లింగయ్య ముఖాముఖి.

జాగ్రత్తలు తీసుకుంటూనే ప్రయాణిస్తున్నారు: మంత్రి పువ్వాడ

ఇదీ చూడండి:కరోనా రికార్డ్​: 24 గంటల్లో 5,611 కేసులు, 140 మరణాలు

ABOUT THE AUTHOR

...view details