తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆర్టీసీని బంగారు బాటలో నడిపిద్దాం'

దేశంలోనే నెంబర్​వన్​గా ఉంచేందుకు జట్టుకట్టి.. పట్టుపట్టి ఆర్టీని బంగారు బాటలో నడిపించేందుకు అందరం కలిసి కృషి చేయాలని మంత్రి పువ్వాడ కార్మికులకు పిలుపునిచ్చారు. కార్మికులు సమ్మె విరమణ అనంతరం మొదటి సారిగా​ మంత్రి అజయ్​కుమార్​ ఖమ్మం ఆర్టీసీ డిపోను సందర్శించారు.

By

Published : Dec 2, 2019, 11:59 AM IST

minister-visit-kammam-tsrtc-dipo
'ఆర్టీసీని బంగారు బాటలో నడిపిద్దాం'

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం ఆర్టీసీ డిపోను సందర్శించారు. సమ్మె విరమణ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్​తో సమావేశమైన కార్మికులకు వరాలజల్లు కురిపించిన తర్వాత రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తొలిసారిగా డిపోకి వెళ్లారు. మంత్రికి కార్మికులు ఘన స్వాగతం పలికారు. డప్పు వాయిద్యాలతో డిపోలోకి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి డిపో లో సందడి చేశారు. రాజధాని బస్సు ఎక్కి డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నారు. కార్మికుల స్వీట్లు పంచారు. గతాన్ని మరచి ఆర్టీసీని దేశంలోనే నెంబర్​వన్​గా ఉంచేందుకు అందరం కృషి చేయాలని మంత్రి పువ్వాడ పిలుపునిచ్చారు.

'ఆర్టీసీని బంగారు బాటలో నడిపిద్దాం'

ఇదీ చూడండి: జీరో ఎఫ్‌ఐఆర్‌ ఉన్నా... న్యాయం జరగట్లేదు...!

ABOUT THE AUTHOR

...view details