తెలంగాణ

telangana

By

Published : Dec 6, 2019, 1:52 PM IST

Updated : Dec 6, 2019, 2:19 PM IST

ETV Bharat / state

'నేను పోలీసు ఎందుకు కాలేకపోయానా అని చింతిస్తున్నా'

దిశ హత్యకేసులోని నిందితులను ఎన్​కౌంటర్​పై మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ పోలీసులను అభినందించారు. తాను ఎందుకు పోలీస్​ కాలేకపోయానా అని మొదటిసారిగా చింతిస్తున్నానని పేర్కొన్నారు.

minister-puvvada-talk-on-disha-accused-encounter
'నేను పోలీసు ఎందుకు కాలేకపోయానా అని చింతిస్తున్నా'

దిశ ఆత్మకు శాంతి చేకూరిందని భావిస్తున్నానని మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ అన్నారు. మొదటి సారి నేను ఎందుకు పోలీస్​ కాలేక పోయానా అని బాధ పడుతున్నానని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఇలాంటి సత్వర న్యాయం జరుగుతుందని ఎప్పుడూ ధర్మమే గెలుస్తుందని తెలిపారు.
ఈ ఎన్​కౌంటర్​ ఘటన ద్వారా దేశానికే రాష్ట్రం ఒక రోల్​ మోడల్​లా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆడపిల్ల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ చూస్తే కళ్లు పీకి చూపిస్తాం అని సీఎం కేసీఆర్​ ఒకప్పుడు చెప్పిన మాటలు తూటాల్లాగా ఖచ్చితంగా నెరవేరుతున్నాయని ప్రజలకు ఇప్పుడు అర్థమవుతుందని పువ్వాడ తెలిపారు.

'నేను పోలీసు ఎందుకు కాలేకపోయానా అని చింతిస్తున్నా'
Last Updated : Dec 6, 2019, 2:19 PM IST

ABOUT THE AUTHOR

...view details